చదవడానికే రెండు రోజులు సమయం పట్టే
సమస్య అద్యయనపు పుటలను
గంటలో చదివి ఆమోదం తెలపాలని
చదువు సంధ్య లేని దాని ఆదేశం అని
ఆఘ మేఘాల మీద చెప్పాల్సిందే అంటే
ఆక్రోశం తో అమాత్యులు అలిగినా
విభజనామోదం అయ్యిందని భజన పరులు
ప్రకటించేసారు
చదువు సంధ్యలు లేని దాని ఆదేశాల
ఊడిగానికి ఆ పీఠాన్ని వాడడం దేశ దరిద్రం
నాన్సెన్సె అని నాయకురాలి కొడుకే
తిడుతూ చేసిన తీర్మానాలను చింపేస్తున్నా
సిగ్గా ఎగ్గూ లేకుండా ఆ పదవి లో వుండడానికి
రాజీ పడిన రోజే గౌరవం పోయింది
అటువంటి సిగ్గూ ఎగ్గూ లేని ఏలిక దగ్గర
పని చేసే
మన అమాత్యులపై
ఆశలు పెట్టు కోవడం అత్యాశే
ప్రజలలో మార్పు ను ఆశించే
ప్రజా రాజ్యాలు కూడా
తెలుగు చెట్టు మీదే కూర్చొని
దెయ్యాల్లా కొమ్మలను విరిచేసాయి
అందరూ రాహుల్ గాంధిని ప్రధానిని చెయ్యడానికి విదగొడుతున్నారని యెలా అనుకుంటున్నారో గానీ అది పూర్తిగా తప్పు. దేశమంతా చంక నాకిపోయి విడగొట్టటం వల్ల సీమాంధ్ర లోనూ నష్టపొయాక ఈ కాసిని సీట్లు చలి కాసుకోటానిక్కూడా పనికి రావుగా! నాకు తోచిన క్లూ వేరే ఉంది. పార్తీ పూర్తిగా వోడిపోయినా సోనియాకీ రాహుల్ కీ అమేధీ యో యేవో నికరమయిన స్థానాలు ఉన్నాయి. మరి వారికి అతి ముఖ్యులయినా చిదంబరం, ఆజాద్ లాంటి వారి సంగతేమిటి? చిదంబరాన్ని ఈ సారి జయలలిత తమిల నాడు నుంచి గెలవనివ్వదు. ఆజాదుని వాళ్ళ పార్తీ వాళ్ళే పార్టీ ఆఫీసుకి రానివ్వట్లేదు, ఇంక పార్లమేంతుకి గెలిపించటం కూడానా?మిగతా వాళ్ళ పరిస్తితీ అనతే. వాళ్ళందరికీ నమ్మకమయిన సీట్ల కోసం – అంటే సొనియ మహా రాణీ గారి పెంపుడు జంతువులకి అధికార భద్రత పధకం.
మెచ్చుకోండిమెచ్చుకోండి