ఇంటర్నెట్ కేఫ్ పెట్టి రాసలీలలు నడిపే కేంద్రాన్ని
అదే పనిగా ప్రసారం చేసి దానిని మూయించిందో తెలుగు ఛానెల్.
నిజంగా ఇది చాలా అభినందించ తగిన విషయం.
కానీ మన మీడియా ఏ ఒక్కటీ కూడా
సచివాలయంలో జరిగిన రాసలీలలకు సాక్ష్యం సంపాదించ లేక పోయింది.
వాళ్ళే రికార్డు చేసుకొని దొరికిపోతే తప్ప ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు పట్టించుకోవు.
ఎవరో ఆకతాయిలు చెప్పంగానే రెడ్ ఆక్సైడు మరకలను పట్టుకొని
రక్తపు మరకలుగా మలిచి మన మనసుకు హత్తుకొనేలా
రక రకాలుగా చెప్పి రక్తి కట్టిస్తారు.
ఒక పెద్ద ఘటన జరిగినప్పుడు పరిశోధనాత్మక కథనాలు బదులు
పలువురు ప్రముఖులను పెట్టి తమకు తోచిన రూపంలో ఊహాగానాలు చేయించి
వీనుల విందుగా వినిపిస్తున్నారు వీలయితే అక్కడే ఆరోపణలు చెయ్యిస్తున్నారు.
వీళ్ళ అవస్థలు చూస్తుంటే అసహ్యమేస్తోంది ఈమధ్య.
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు